ట్రస్టు

డా. రాంభట్లవేంకటరావుమెమోరియల్ ట్రస్ట్ :

స్థాపన : 24, నవంబర్‌ 2007 (కార్తీక శుద్ధ పౌర్ణమి)


స్థలం : శ్రీ లలితాపీఠం, విశాఖపట్నం


సందర్భం : కీ.శే. డా.రాంభట్ల వేంకటరావు (కుప్పిలి డాక్టరు) గారి
108వ జయంత్యుత్సవం.

పారంభ కార్యవర్గం :
వ్యవస్థాపక అధ్యక్షులు : శ్రీమతి, శ్రీ రాంభట్ల లక్ష్మీనృసింహ సోమయాజులు
సూర్యకాంత కామేశ్వరి దంపతులు,ఇతర కుటుంబీకులు
అధ్యక్షులు : 'దహరానందనాథ' శ్రీశ్రీశ్రీ రాంభట్ల వేంకటసోమయాజులు
ఉపాధ్యక్షులు : రాంభట్ల పార్వతీశ్వర శర్మ (సీనియర్‌)
కార్యదర్శి : 'అష్టావధాని' రాంభట్ల పార్వతీశ్వర శర్మ
కోశాధికారి : రాంభట్ల వేంకటరాయ శర్మ

ప్రస్తుత కార్యవర్గం :
అధ్యక్షులు : రాంభట్ల పార్వతీశ్వరశర్మ (సీనియర్‌)
కార్యదర్శి : 'అష్టావధాని' రాంభట్ల పార్వతీశ్వర శర్మ
కోశాధికారి : రాంభట్ల వేంకటరాయ శర్మ

సభ్యులు :
1. రాంభట్ల సుబ్బ లక్ష్మి
2. టి.వి.ఎల్‌.నర్సింగరావు

డా. రాంభట్ల వేంకటరావు మెమోరియల్ట్రస్ట్ఆశయాలు - విధులు

  • వ్యక్తులనుండి కానీ, సంస్థలనుండికానీ ఎలాంటి విరాళాలను సేకరించకుండా నడుస్తున్న కుటుంబ సబ్యుల స్వచ్చంద సేవా సంస్థ.
  • సాహిత్యోపన్యాసాల నిర్వహణ
  • ఆధ్యాత్మిక ఉపన్యాసాల ఏర్పాటు
  • నూతన సంవత్సర కాలనిర్ణయం పట్టి (కేలండర్‌)ను వెలువరించడం. (ప్రతి సం. నవంబరు 24 వ తేదీన)
  • కవిసమ్మేళనాలు, సాహిత్య, వైద్యరంగాలలోని ప్రముఖులను సత్కరించడం.
  • వివిధ సాహిత్య, ఆధ్యాత్మిక, సంప్రదాయ గ్రంథ సమీక్షలను నిర్వహించడం.
  • స్వీయ గ్రంథాల ప్రచురణ.
  • సాహిత్యాన్ని బ్రతికించడంకోసం అవధానాలు చేయించడం.
  • సాహిత్య విలువల్ని ప్రజల్లోకి తీసుకురావడానికి తెలుగు దేశం నలుమూలల నుండి సాహితీ ప్రముఖులను ఆహ్వానించి వారిని సత్కరించడం
  • విశాఖ జిల్లా పరిధిలో సాహితీవేత్తలందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడం.
  • సమాజంలో ఉన్న మూఢ విశ్వాసాలను సాహిత్యం ద్వారా రూపుమాపడానికి కృషిచేయడం.

డా.రాంభట్ల వేంకటరావు మెమోరియల్‌ ట్రస్ట్‌ సంస్థ కార్యక్రమాలు ప్రారంభ కాలంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరిపేవారు, అది సంస్థ వ్యవస్థాపక దినోత్సవంనాడు, ఈ విధానం సుమారు 2012వరకు కొనసాగింది. తరువాత కాలంలో ఇ ది నెలకు ఒక సాహిత్య కార్యక్రమం చేసేవిధంగా పూనుకొని ప్రస్తుతం ప్రతినెల మూడు లేక నాలుగో ఆదివారం కార్యక్రమాలు చేస్తున్నారు.


ఈ సంస్థ నిర్వహించే కార్యక్రమాలలో సాహితీ ప్రియులతోపాటు సాహిత్యేతర ప్రముఖులను ఆహ్వానించడం జరుగుతుంది. ఎందుకంటే సాహిత్యంపట్ల ఏమాత్రం అవగాహన లేనివారికి కూడా ఆసక్తిని కల్పించుటకు ఈ ప్రయత్నం చేస్తున్నారు.

 

ఆచార్య నిమ్మా వెంకటరావు, (ఆంధ్ర విశ్వకళాపరిషత్,) డా. ఎస్‌.వి. ఆదినారాయణ రావు (ప్రేమ హాస్పిటిల్‌ ఎం.డి) శ్రీవాడరేవు సుబ్బారావు (మేనెజర్, లలితాపీఠం, విశాఖ) మొదలైనవారు సంస్థ ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో ముఖ్యాతిథులుగా పాల్గొంటూ చేయూతనిస్తున్నారు.

 

సాహితీ ప్రముఖులుగా ఆహ్వానింపబడ్డవారిలో ముఖ్యంగా
1. గరికపాటి నరసింహారావు 2. వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి 3. మలయవాసిని 4. డి.వి. సుబ్బారావు
5. గన్నవరపు వరాహ నరసింహమూర్తి (యు.ఎస్‌.ఎ.)వీరంతా ఈ సంస్థ నిర్వహించబడే కార్యక్రమాలకు హాజరై తమ ఉపన్యాసించి సత్కారాలు పొందారు. ఇంకా వారితోపాటు విలువైన ఉపన్యాసాలిచ్చి సన్మానించబడ్డవారిలో సినీ హాస్యనటులు శ్రీ కళ్ళు చిదంబరం,” పండిత” నేమాని రామజోగిసన్యసిరావు మొదలైన వారున్నారు.


విశాఖ జిల్లాలో ముఖ్యంగా నగరంలో అవధానాలను జరిపిస్తూ అవధాన ప్రక్రియకు ఒక గుర్తింపునిచ్చే సంస్థగా ఎన్నో సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తుంది. కవితాగోష్ఠులు, సాహిత్య, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, గ్రంథ సమీక్షలు, కవిసమ్మేళనాలు మొదలైన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు.


ఈ సంస్థ చేసే కార్యక్రమాలను కొంచెం దగ్గరగా పరిశీలిస్తే :-
2007 నవంబరు 24న శ్రీలలితా పీఠంలో జరిగిన డా.శ్రీ రాంభట్ల వేంకటరావుగారి 108వ జయంతోత్సవం సందర్భంగా 'రాంభట్ల వేంకటీయం' అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అలాగే 2009 నవంబరులో 2010 సంవత్సరం క్యాలెండర్‌ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా శ్రీమతి మలవాసిని, విశిష్టాతిథిగా శ్రీ ఎస్‌.వి. ఆదినారాయణ రావ మొదలైన ప్రముఖులు ఆహ్వానించ బడ్డారు. అయితే ఇదే కార్యక్రమంలతో డా.గరికపాటి నరసింహారావుగారి చేత 'అష్టావధానసభ' నిర్వహించబడింది. ఈ అవధానానికి సంచాలకలుగా శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి వ్యవహరించారు.

2010లో ఈ సంస్థ 4వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిపారు. 2010 నవంబరు 24న లలితాపీఠంలో జరిగిన ఈ సభలో ముఖ్యఅతిథిగా డా.జె.వి.వి.ఎన్‌. మూర్తి ప్రిన్సిపాల్, డా. వి.ఎస్. కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వారు విలువైన ఉపన్యాసాన్ని ఇచ్చారు. అలాగే 2011లో క్యాలెండర్‌న ఆవిష్కరించి తొలి ప్రతిని “సహజ జ్యోతిష పండిత” శ్రీ టి.వి.ఎల్‌. నర్సింగరావు గారికి అందజేసారు. ఈ సభలోనే శ్రీ శంకర భగవత్పాదులతవారి 'మనీషా పంచకం' పై ప్రసంగాన్ని ఏర్పాటు చేసారు. దీనిపై ప్రసంగించినారు అష్టావధాని, “పండిత” శ్రీ నేమాని రామజోగి సన్యాసిరావు.

2012 ఫిబ్రవరి 12న “ఆచార్యసార్వభౌమ” వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అధ్యక్షతన విశాఖ శ్రీ లలితాపీఠంలో జరిగిన సాహితీ కార్యక్రమం నగరంలో ఒక ప్రత్యేకతను సంతరింపచేసింది. ఈ కార్యక్రమంలో జరిపించబడిన అష్టావధానం అందరిమన్ననలను పొందింది. ముఖ్యంగా అవధాని అయిన శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ (జూనియర్) అద్భుతమైన అవధాన నిర్వహణలో ఈ సభ నడిచింది. ఈ సభకుసాహితీ ప్రముఖులందరూ విచ్చేసి కవితా రసభరితమైన అష్టావధానాన్ని చూసి ఆనందించి లలితా మాతృ కృపామృతాన్ని పొందారు.


2012 డిశంబరులో ఆరవ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా శ్రీ చక్ర పీఠం వారు శ్రీ రాంభట్ల వేంకట సోమాయాజలుగారు వ్యవహరించారు. ముఖ్యాతిధిగా డా.ఎస్‌.వి.ఆదినారాయణరావు విశిష్టాతిధిగా డా.నిమ్మా వెంకట్రావు హాజరయ్యారు, ఈ సాహిత్యసభలో 'సాహిత్యము - సమాజము' అనే అంశంపై ఆచార్య సార్వభౌమ శ్రీవేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి ఉపన్యసించారు. సభా వ్యాఖ్యాతగా శ్రీ రాంభట్ల నృసింహశర్మ వ్యవహరించారు. ఈ సభా సమావేశం లలితా పీఠంలో ఘనంగా నిర్వహించబడింది.

 

2013లో శ్రీశ్రీశ్రీ “దహరానంద నాథ” రాంభట్ల వేంకటసోమయాజులు గారి జీవిత విశేషాలు, 'అర్ష విజ్ఞాన విశిష్టత' గ్రంథ వైభవం పై సమీక్షా సమావేశం జరిపించారు. ముఖ్యవక్తగా విచ్చేసిన శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి అద్భుత ప్రసంగంతో సాహితీ ప్రియులందరి మన్ననలను ఈ సంస్థ పొందింది.

 

2013 మార్చిలో 'ప్రపంచ కవితా దినోత్సవం' సందర్భంగా “స్వీయ కవితా పఠనం” జిరిగింది. ఈ సభ సమన్వయకర్తగా “ప్రవచన కళానిధి” “విద్యాన్‌” తిరుమల పెద్దింటి నరసింహా చార్యులు వ్యవహరించారు. ఈ స్వీయ కవితా పఠనంలో చాలామంది కవులు పాల్గన్నారు. అట్టివారిలో ముఖ్యంగా నేమాని రామజోగి సన్యాసిరావ, శ్రీ భాగవతుల కృష్ణారావు, పి.వి. కృష్ణయ్య, చింతా ప్రభాకర్‌, శేఖర మంత్రి ప్రభాకరరావు, కె.జి. వేణు, శ్రీమతి కందాళ కనకమహలక్ష్మి మొదలైనవారు పాల్గన్నారు. ఈ సభ నిర్వహణా కర్తగా అష్టావధాని రాంభట్ల పార్వతీశ్వరశర్మ వ్యవహరించారు.


2013లో కలశేఖరాళ్వారు విరచితమైన ''ముకుందమాల' అనే అంశంపై ప్రసంగం నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిధిగా శ్రీ కళ్ళు చిదంబరం విచ్చేశారు. అలాగే 'శ్రీ లక్ష్మీ నరసింహా శతకం' పుస్తకంపై సమీక్ష చేశారు, సమీక్షకులుగా రాంభట్ల సత్యవతమ్మగారు వ్యవహరించారు.

 

ఈ సంస్థవారు కేవలం ఈ విధమైన సాహితీ కార్యక్రమాలు మాత్రమే కాకుండా తెలుగు భాషాదినోత్సవం, మాతృభాషా దినోత్సవం, ప్రపంచ కవితా దినోత్సవంలాంటి ఎన్నో సందర్భాలను పురస్కరించుకొని నగరంలో ఘనంగా సహితీ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం జరిపించే వ్యవస్థాపక దినోత్సవానికి నగరంలో ఉన్న సాహితీసంస్థల నిర్వాహకులను పిలిచి సన్మానించడం క్రమంగా చేస్తున్నారు.

 

ఆవిష్కరణలు:
ఈ సంస్థ కార్యమ్రాలలో ముఖ్యమైనది పుస్తకావిష్కరణలు . ఈ ఆవిష్కరణలకు అధిక ప్రాధాన్యాన్నిస్తూ ఈ మధ్యకాలంలో పుస్తకావిష్కరణలు చేస్తుంది ఈ విధంగా ఆవిష్కరణలు చేసినవాటిలో చేసినవాటిలో అవధాన సుధాకర రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారి ౩ పుస్తకాలున్నాయి.


1. శ్రీరాంభట్ల వెంకటీయం. ఇది కుప్పిలి డాక్టరు గారి జీవితచరిత్ర. దీన్ని 2007లో రాశారు. ఇది లఘు పద్యకావ్యం.
2. మొదటి మొగ్గలు - ఇది వచన కవతా వ్యాసంగం.
3. ప్రతిభ స్వరాలు – ఇది పద్యకవితా మాలిక.

 

ఈ విధంగా 2007లో విశాఖ జిల్లాలో స్థాపించబడిన ఈ సాహితీ సంస్థ అతి తక్కువ కాలంలోనే ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి సాహితీ విలువలను లోకంమంతటా ప్రచారం చేయడానికి కంకణం కట్టుకుందని చెప్పడంలో ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అయితే నగరం నడిబడ్డున లలితా పీఠాన్ని వేదిక ఏర్పాటు చేసుకోవటంలో ప్రధాన ఉద్దేశ్యం ఆధ్యాత్మికతను ప్రోత్సహించడం అనేది వ్యక్తమవుతుంది. అయితే ఆధ్యాత్మిక సాహిత్యం కూడా సాహిత్యంలో భాగమే కాబట్టి దీనికి వీరు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని గ్రహించాలి.

 

ముఖ్యంగా ఈ సంస్థ అవధానాలను ప్రోత్సహిస్తుందని అయా కార్యక్రమాల ద్వారా తెలుస్తుంది. ఈ అవధాన ప్రక్రియ సాహిత్యంలో సాంప్రదాయ కవిత్వానికి చెందింది. కావున ఈ సంస్థ సాంప్రదాయ కవిత్వానికి కట్టుబడి ఉందనే నినాదం తీసుకురావచ్చు.

 

ఈ విధంగా ఏ విదమైన కార్యమ్రాలు చేసినా అన్నీ సాహిత్యానికి సంబంధించినవేనని చెప్పాలి. సాహిత్యంలో ఉన్న వివిధ ప్రక్రియలలో కొన్నింటిని ఈ సంస్థ ప్రోత్సహిస్తూ సాహిత్య మాధుర్యాన్ని నెమరువేసుకొనేలా సహృదయులను ఆకట్టుకునేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అలాగే విశాఖలో ఉన్న వివిధ సాహితీ సంస్థలవలె ఈ సంస్థకూడా తనదైన శైలిలో ముందుకెళుతూ తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధికి పాటుపడుతోందని తెలుస్తుంది.